హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో హుస్నాబాద్ గీతా కార్మికులు ప్రకృతి ప్రసాదమైన తాటి ముంజలను అందజేశారు. వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ముంజలను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ముంజల విక్రయానికి ప్రభుత్వం తరపున పూర్తి మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాటి ముంజలు సహజ సిద్ధమైనవని, వీటిలో ఎలాంటి మత్తు ఉండదని, అందరూ నిరభ్యంతరంగా తినవచ్చని పేర్కొన్నారు. దీని ద్వారా గీతా కార్మికులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. ఈ సంఘటన ఖైరతాబాద్లో జరిగింది.

