తెలంగాణలో భూసారాన్ని కాపాడేందుకు కొత్త వాలంటీర్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున 30,000 సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమిస్తారు.
ఈ వాలంటీర్లు రైతులను రసాయనాల వినియోగం తగ్గించి, భూమి ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు అవగాహన కల్పిస్తారు. తొలి విడత వాలంటీర్లకు హైదరాబాద్లోని ఇక్రిశాట్లో ఇప్పటికే శిక్షణ ప్రారంభమైంది.

