తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది.
సోమవారం ఒక్కరోజే 70,996 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,809 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.74 కోట్లుగా నమోదైంది.

