కల్ట్ క్లాసిక్ 'త్రి ఇడియట్స్' చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఆమీర్ ఖాన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సీక్వెల్లో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం.
ఒరిజినల్ చిత్రంలోని ఆమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి తమ పాత్రలను తిరిగి పోషించనుండగా, వీరికి తోడు నాలుగో ఇడియట్గా విక్కీ కౌశల్ చేరబోతున్నాడు. రాజ్కుమార్ హిరానీ ఈ సీక్వెల్ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. 'త్రి ఇడియట్స్' కథ ముగిసిన 10 ఏళ్ల తర్వాత జరిగే పరిణామాల ఆధారంగా సీక్వెల్ ఉంటుందని ఆమీర్ ఖాన్ వెల్లడించారు.

