వనస్థలిపురంలో యువతిని ఆరు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్న శ్రావణ్ రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. బాధితురాలి బంధువైన శ్రావణ్ రెడ్డి, ఫోన్లలో వేధించడంతో పాటు, గత నెల 30న కాలేజీ వద్ద అడ్డుకొని, సాయంత్రం ఇంటికి వెళ్లి ప్రేమించకపోతే చంపేస్తానని లేదా చచ్చిపోతానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

