రైతు సమస్యలను అజెండాగా చేసుకుని ప్రధాన పార్టీలు వరంగల్ లో ఒకరిపై ఒకరు దాడులు ముమ్మరం చేశాయి. అధికార పార్టీ రైతు సభలతో తమ కార్యక్రమాలను విస్తరించగా, ప్రతిపక్షాలు అదే అంశంపై రోడ్లెక్కి నిరసనలు తెలిపాయి.
ముఖ్యంగా పంటల కొనుగోలు, ధాన్యం సమస్యలు, మద్దతు ధరల అంశాలపై మాటల యుద్ధం నడుస్తోంది. వరుసగా సభలు, ధర్నాలు, ఆందోళనలతో వరంగల్ రాజకీయంగా వేడెక్కింది.

