ప్రింట్ మీడియా ఇప్పుడు దీన స్థితిలో ఉంది. దిన పత్రికల పరిస్థితే. దిన దిన గండం - నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు తయారైంది. సాహిత్య పత్రికల సంగతి ఇక చెప్పాల్సిన పనిలేదు. నామ్ కే వాస్తే - ఉంటున్నాయంతే. బలమైన అండ దండలున్న పత్రికలే వరుసగా మూతపడుతున్నాయి. ఇప్పుడు రామోజీ ఫౌండేషన్ నుంచి వచ్చే తెలుగు వెలుగు, బాల భారతం, విపుల, చతుర కూడా శాశ్వతంగా సెలవు తీసుకున్నాయి.
దశాబ్దాలుగా సాహితీ సేవ చేస్తున్న పత్రికలు విపుల - చతుర. విపుల ఓ విశ్వ కథల ప్రపంచం. చతురలలో నవవలు వస్తుంటాయి. తక్కువ ధరకు ఈ పత్రికలు లభిస్తుండడంతో.. సాహితీప్రియులు మొగ్గు చూపించారు. చతురలో వచ్చే నవలలు కొన్ని సినిమాలుగానూ వచ్చాయి. పదేళ్ల క్రితం..
తెలుగు వెలుగుపై రామోజీరావుకి ప్రత్యేకమైన ఇష్టం. పత్రిక ముందు నుంచీ నష్టాల్లో ఉన్నా సరే, కేవలం భాషపై మమకారంతో ఈ పత్రికని నడిపారు. దాన్ని సైతం.. మూసేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రామోజీ సంస్థలకు ఓ గట్టి నియమం ఉంది. ఏ సంస్థ నష్టాల్లో ఉన్నా - ఉపేక్షించరు. `సితార` నష్టాల బాట పట్టిన వెంటనే, కనీసం ముందస్తు ప్రకటన కూడా లేకుండా మూసేశారు. ఈ నాలుగూ సాహితీ పత్రికలు కాబట్టి, నెలసరి చందాదారులు ఉంటారు కాబట్టి, ముందుగా ఓ ప్రకటన ఇచ్చారేమో.
ఈనాడు దిన పత్రిక భారీ లాభాల్లో ఉన్నప్పుడు - ఆయా పత్రికల నిర్వహణ అంత కష్టమనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఈనాడు కూడా నష్టాల్లో నడుస్తోంది. ప్రకటనలు బాగా తగ్గిపోయాయి. దాంతో. మిగిలిన ఖర్చుల్ని ఎలా తగ్గించుకోవాలా? అనే ఆలోచనలో పడింది యాజమాన్యం. అందులో భాగంగా ఉద్యోగుల్ని తొలగించారు. జీతాలు కట్ చేశారు. ఇప్పుడు.. ఏకంగా నాలుగు సాహితీ సంస్థల్నే మూసేశారు. రామోజీ రావు లాంటి వ్యక్తే సాహితీ సేవ మేం చేయలేం.. అంటూ దండం పెట్టేశాడంటే, మిగిలినవాళ్ల మాటేంటి?

