Dailyhunt
భారత్ దాడి.. 300మంది ఉగ్రవాదులు హతం

భారత్ దాడి.. 300మంది ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతీకారంగా పాకిస్తాన్ లోని బాలాకోట్ పై ఇండియా వైమానిక దళం దాడులు చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలున్న బాలకోట్‌పై భారత వాయు సేన జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు ఆ దేశ మాజీ దౌత్యవేత్త ఆఘా హిలాలీ అంగీకరించారు. చాలాకాలంగా ఈ దాడుల్లో ఎవరూ మరణించలేదని, చెట్లమీద, ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే ఇండియా వైమానిక దళం దాడులు చేసిందని చెప్పుకొస్తోంది పాక్.

పాక్ చేసినవన్నీ అవాస్తవాలు అని పాక్ మాజీ దౌత్యవేత్త హిలాలి తాజాగా వ్యాఖ్యనించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పాకిస్థాన్‌ టీవీ చర్చా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే ఆయన నాడు బాలకోట్‌ వైమానిక దాడుల్లో ఎవరూ చనిపోలేదన్నారు. తాజాగా తన మాటను ఆయన మార్చరు. ఆ దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు చెప్పడం గమనార్హం. ఇండియా జరిగిన వైమానిక దాడిలో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని అయన తెలిపారు. ఇక పుల్వామా దాడిని ప్రపంచం మొత్తం ఖండించగా, పాక్ మంత్రి ఫవాద్ చౌధురి భారత్ పై విజయంగా చెప్పుకొచ్చారు. పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెనుదుమారం రేపాయి.

ఇదిలా ఉండగా 2019 ఫిబ్రవరి 14న జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ వాహనంపై ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే.
ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. ఈ దాడికి తమదే బాధ్యత అని పాకిస్థాన్‌ నుంచి పని చేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దారుణాన్ని అంతర్జాతీయంగా అనేక మంది ఖండించారు. అనంతరం భారత వాయు సేన బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై లక్షిత దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) చేసింది. అప్పట్లో దీనిపై పాకిస్థాన్ స్పందిస్తూ, తమవైపువారు ఎవరూ మరణించలేదని ప్రకటించింది.

ఆ టీడీపీ సీనియర్ ఆ భయంతోనే మారిపోయాడా.... జగన్ దెబ్బ మామూలుగా లేదుగా...!

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచన...


కేజీయఫ్‌ 'అధీర' పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald