ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఐదు జిల్లాల్లో ఆయన ప్రచారం చేయబోతున్నారు. తన సొంత జిల్లా చిత్తూరు నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు చంద్రబాబు.
అయితే మున్సిపల్ ప్రచారానికి వెళుతున్న చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు చిత్తూరు జిల్లాకే మొదటగా వెళుతుండగా..