Dailyhunt
ఈసారి తిరుపతి విమానాశ్రయం వంతు?

ఈసారి తిరుపతి విమానాశ్రయం వంతు?

తిరుపతి విమానాశ్రయాన్ని ప్రయివేటుపరం చేసే ప్రతిపాదనలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా కేంద్రానికి పంపించింది. ఏడు చిన్న, ఆరు పెద్ద విమానాశ్రయాలను కలిపి ఉమ్మడిగా బిడ్డింగ్‌ నిర్వహించాలని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదించింది.
ఇందులో భాగంగా వారణాశి-ఖుషీనగర్‌, గయ, అమృత్‌సర్‌-కాంగ్రా, భువనేశ్వర్‌-తిరుపతి, రాయ్‌పుర్‌-ఔరంగాబాద్‌, ఇండోర్‌-జబల్‌పుర్‌, తిరుచ్చి-హుబ్లి విమానాశ్రయాలను ఒక్కో ప్రాజెక్టులా ప్రైవేటుకు అప్పగించనున్నారు. లాభాలు పెద్దగా లేని విమానాశ్రయాలను మంచి లాభాలున్న వాటితో కలిపి బిడ్డింగ్‌కు పెట్టడం వల్ల ప్రైవేటు సంస్థలు స్పందిస్తాయని కేంద్రం భావిస్తోంది. 2022-25 మధ్య దేశంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించి, రూ.20,782 కోట్లు రాబట్టుకోవాలని నిర్ణయించినట్లు నేషనల్‌ మానిటైజేషన్‌ పాలసీలో కేంద్రం ప్రకటించింది.
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చేతిలో 137 విమానాశ్రయాలు ఉన్నాయి. అందులో 24 అంతర్జాతీయ, 10 కస్టమ్స్‌, 103 దేశీయ విమానాశ్రయాలు. 2020-21లో అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, మంగళూరు, గువాహటి, జైపుర్‌, తిరువనంతపురం విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించేసింది. 2024లో ఏపీలోని విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను ప్రైవేటీకరించి రూ.860 కోట్లు రాబట్టుకోవాలని కేంద్రం నిర్ణయించింది.

డిఫెన్స్ లో దొంగలు పడ్డారు.. కీలక సమాచారం ఏమవుతుంది..!


బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీ హిట్టేనా?

బద్వేలు: వైసీపీ కామెడీ మరీ ఓవర్‌గా ఉందా..!

బిగ్ బాస్ 5: తన స్వార్థం కోసమే సిరి షణ్ముఖ్ ను వాడుకుంటోందా?

హరిహర వీరమల్లు పైనే అందరి చూపు.. ఎందుకంటే?

బద్వేలు: ఓటర్లు దండెత్తితే.. ఫలితం ఎటు...?

మనీ: నెలకు రూ.1300 తో చేతికి రూ.40 లక్షలు..!!

రేషన్ షాపుల్లో సిలిండర్ల అమ్మకం..!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald