ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోక పోయినా సరే ఖచ్చితంగా తిరుపతి ఎన్నికల తర్వాత మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కీలక అంశాల్లో ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న తప్పులు ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉండవచ్చు అని సమాచారం.ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే కొన్ని కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు భారీగా కేటాయిస్తున్నది.

