వీటిలో కూడా ఆన్లైన్ టీచింగ్, టెలీకౌన్సెలింగ్, విద్యావారధి తదితర కార్యక్రమాల కోసం 50 శాతం మంది టీచర్లు హాజరుకావాలని చెప్పింది. కొవిడ్ ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో మాత్రం స్కూల్స్ తెరవరు.- విద్యార్థులు ఒకరికొకరు కనీసం 6 అడుగుల దూరం పాటించేలా చూడాలి. ప్రతి ఒక్కరూ ఫేస్మాస్కు ధరించడం తప్పనిసరి.
- దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివారు వినియోగించే టిష్యూ పేపర్లు, కర్చీఫ్లను నిర్దేశిత ప్రదేశంలో దూరంగా పడేసేలా చూడాలి.
- నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, వాటర్బాటిళ్లు విద్యార్థులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాానికి అనుమతి లేదు.
- ఒకటినుంచి 8 తరగతుల విద్యార్థులు ఇంటి వద్దనే చదువుకోవాలి.