అన్ లాక్ లో అన్నీ తెరుచుకుంటున్నా.. స్కూల్స్, కాలేజీలు తెరవడానికి మాత్రం ప్రభుత్వాలు సాహసం చేయడంలేదు. కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టేసినా.. అనుమతులు మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 21నుంచి స్కూల్స్ తెరిచే ఉద్దేశంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం తాజాగా మరోసారి మార్గదర్శకాలను రూపొందించింది. కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్లాక్ 4 ఆదేశాలను అనుసరించి స్కూళ్లను తెరవడంపై ఏపీ పాఠశాల విద్యా శాఖ తాజాగా మార్గదర్శకాలను ఇచ్చింది. దీంతో ప్రభుత్వ యాజమాన్యాల్లోని ఆయా విభాగాలు తమ పరిధిలోని స్కూళ్లను తెరిపించడంపై దృష్టి సారిస్తున్నాయి.
- కంటైన్మెంట్ జోన్లకు బయట ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలు మాత్రమే తెరవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
- కంటైన్మెంట్ జోన్లకు బయట ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలు మాత్రమే తెరవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.- దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివారు వినియోగించే టిష్యూ పేపర్లు, కర్చీఫ్లను నిర్దేశిత ప్రదేశంలో దూరంగా పడేసేలా చూడాలి.
- నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, వాటర్బాటిళ్లు విద్యార్థులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాానికి అనుమతి లేదు.
- ఒకటినుంచి 8 తరగతుల విద్యార్థులు ఇంటి వద్దనే చదువుకోవాలి. వారెవరినీ స్కూళ్లకు రప్పించకూడదు. వీరికి సంబంధించి వర్క్షీట్లను అభ్యాస యాప్లో పొందుపరిచారు. వాటిని డౌన్లోడ్ చేసుకొని అభ్యసనం కొనసాగించేలా చూడాలి.
- ఈ నెల 21 నుంచి కంటైన్మెంట్ జోన్ల బయట తెరిచే స్కూళ్లు, కాలేజీల్లోకి 9, 10, ఇంటర్ విద్యార్థులను మాత్రమే సందేహాల నివృత్తికి అనుమతించాలి. ఇందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.
- ఆయా తరగతులు బోధించే టీచర్లు.. విద్యార్థుల స్థాయిని అనుసరించి హైటెక్, లోటెక్, నోటెక్గా విభజించాలి. అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకొని మార్గనిర్దేశం చేయాలి.
- గురుకుల పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల విషయంలో టీచర్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయించి గైడెన్స్ ఇవ్వాలి.
- ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు 9,10, ఇంటర్ విద్యార్థుల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను కూడా విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పొందుపరిచారు.
టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లేపేసిన బిగ్ బాస్-4 సీజన్..
అల్లు అర్జున్ పై పోలీస్ కేసు.. అసలేం జరిగింది..?
ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత షూట్ కి అల్లు అర్జున్ ?
మహేష్ తో పూరిని కలపాలని చూస్తున్న నిర్మాత...?
మంచి పనికోసం ముందుకొస్తున్న నాగబాబు..
పవన్ బాలయ్య కలసే వస్తారా ?
ట్రంప్ వ్యూహం భారతీయుల కోసమేనా..?
భయ పడకండి మీకు మేమున్నాం:
అవినీతి అధికారులు మిమ్మల్ని జలగల్లాగ పీడిస్తున్నారా? మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరితో మొరపెట్టుకోవాలో మీకు తెలియడంలేదా? ఇండియా హెరాల్డ్ నిర్భయంగా మీ ఘోషను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళుతుంది. మీ బాధను పూర్తి వివరాలు, ఆధారాలతో సహా nofear@indiaherald.com కు నేడే పంపించండి.
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao

