చంద్రబాబుని అనేక రకాలుగా అవమానించారు. టిడిపి నేతలు, కార్యకర్తలపై కేసులు, జైల్లో పెట్టడం జరిగాయి.
అయితే టిడిపి నేతలు కూడా బూతులతో రెచ్చిపోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా టిడిపి నేత పట్టాభి...సిఎం జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరుష పదజాలంతో దూషించారు. ఇలాంటి మాటలు ఏపీ రాజకీయాల్లో కామన్ అయిపోయాయి. ఇంతకంటే ఎక్కువగానే వైసీపీ నేతలు చంద్రబాబుని తిడుతూ వస్తున్నారు. కానీ వైసీపీ నేతలు ఆవేశానికి లోనై...టిడిపి కార్యాలయాలపై దాడి చేశారు.
ఇక దాడికి నిరసనగా చంద్రబాబు ఏమో రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. తమ నేతలని బూతులు మాట్లాడకుండా కంట్రోల్లో పెట్టకుండా పరిస్తితిని ఇంతవరకు తీసుకొచ్చారు. దీనికి ప్రతిగా జగన్ మాట్లాడుతూ....అసలు తమకు బూతులు తెలియవని, అలాంటి బూతులే వినలేదని అంటారు.