Dailyhunt
కర్నూలు జిల్లాలో పెద్ద పులి అలజడి

కర్నూలు జిల్లాలో పెద్ద పులి అలజడి

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడుపులుల అలజడి ఆందోళన కలిగిస్తుంది. ఎక్కడో ఒక చోట పులి బయటకు రావడం అది సంచరించడం అన్నీ కూడా ప్రజలను కాస్త కంగారు పెట్టే అంశంగా చెప్పాలి. దాదాపు తెలంగాణాలో ఉన్న అన్ని జిల్లాల్లో ఈ మూడు నాలుగు నెలల్లో పులులు బయటపడుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తున్న పులులు పెద్ద తల నొప్పిగా మారాయి జనాలకు.


తాజాగా కర్నూలు జిల్లాలోని వెలుగొడు తెలుగు గంగ కాలువ సమీపంలో పెద్దపులి కనపడింది. గొర్రెల మందపై పెద్దపులి దాడి చేసింది అని రెండు గొర్రెలు మృతి చెందాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి దెబ్బకు ఎప్పుడు ఎం జరుగుతుందో అనే భయం వారిని వెంటాడుతుంది. ఇక అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald