ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇప్పుడు ఏడు లక్షలకు చేరుకుంది. దాదాపు అన్ని దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం చూపిస్తుంది. అమెరికా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్ ఇలా తేడా లేకుండా కరోనా వైరస్ క్రమంగా విస్తరించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.
కరోనా కేసులు ఇప్పట్లో అదుపులోకి రావనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కరోనా మరణాలు రెండు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో దాదాపు 20 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఒక్క ఇటలీలోనే 10 వేల మంది, స్పెయిన్ లో 5 వేల మంది అమెరికాలో 5 వేల మంది ఇతర దేశాల్లో 5 వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయని అంటున్నారు.
ప్రస్తుతం అమెరికా సహా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఇది అదుపులోకి రాకపోతే మాత్రం ప్రపంచంలో సగం జనాభా కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినా సరే ఆశ్చర్యం లేదని అంటున్నారు. మన దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరగడం ఖాయమని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు కరోనా మరింత ఆందోళనకు గురి చేస్తుంది. మరి ఎప్పుడు అదుపులోకి వస్తుందో చూడాలి.
ఈ రెండు రోజులే కీలకమా ? ఆ తేదీతో పీడ విరగడవుతుందా ? ఈ మైసూర్ బాల మేధావి చెబుతోంది నిజంగా నిజామేనా ?
మహారాష్ట్ర కేరళ పరిస్థితి ఏంటీ...?
మనం ప్రస్తుతం కరోనా వార్ జోన్ లో ఉన్నాము..... తప్పదు ప్రతి ఒక్కరం ఈ యుద్ధం చేయాల్సిందే....!!
సంజీవన్ మీకు మీ పరివారానికి కరోనా వైరస్ రిస్క్ ఎంతో తెలుసుకోవడానికి NIHWN.Co. వారిచే ఆవిష్కరించబడిన హెల్త్ వెల్ నెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజన్
కరోనా ఛాలెంజ్ అంటే ఏమిటో తెలుసా?
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh

