ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఒక్కటై జగన్ ను సమస్యల వలయంలోకి నెట్టాలని చూస్తున్నారు.. అయితే ప్రజల అండదండ ఉన్నన్నాళ్ళు జగన్ ను ఎవరు ఏమీ చేయలేరని అందరికి తెలిసిన విషయమే.. తాజాగా ప్రతిపక్షాలకు తోడు న్యాయమూర్తులు జగన్ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది.. ఉన్నత స్థానంలో ఉంది న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు ఇలా అన్యాయంగా ప్రవర్తించడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. ఇక ప్రభుత్వంపై వేస్తున్న అన్ని కేసుల్లో నూ వైసీపీ కి వ్యతిరేకంగానే తీర్పులు వస్తుండడంతో వైసీపీ లో ఆందోళన గురవుతుంది.. నిమ్మగడ్డ వంటి కీలక మైన కేసులో కూడా ప్రభుత్వంపై దుమ్మెతి పోసే ప్రయత్నం చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, రమేష్ బాబు కేసు ఇలా ప్రతి విషయంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది..