ప్రపంచంలో ఆధిపత్యంకోసం ఒకప్పుడు యుద్ధాలు సైన్యంతో జరిగేవి. ఎక్కువ సైన్యం ఉన్నవాడే యుద్ధం గెలిచేవాడు.. ఆ తర్వాత ఏనుగులు, గుర్రాలు వంటి బలాలు ఉన్నవాడు యుద్ధం గెలిచేవాడు. ఆ తర్వాత కాలంలో ఓడలు ప్రాముఖ్యం పెరిగింది. నౌకాబలంతో యుద్ధాలు గెలిచేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫిరంగులు, తుపాకులు వంటి వాటి ప్రాముఖ్యం పెరిగింది. ఇప్పుడు యుద్ధం సీన్ పూర్తిగా మారిపోయింది. కొన్నాళ్ల క్రితం బయో వెపన్స్ గురించి చర్చ జరిగింది. ఇక ఇప్పుడు టెక్నాలజీ వంతు వచ్చింది.
ఆధునిక కాలంలో ప్రతి దాని గురించి సర్వర్లు, కంప్యూటర్లపై ఆధారపడటం, ఆటోమేషన్ యుగంలో ఇప్పుడు యుద్ధాలు కూడా కంప్యూటర్లతోనే జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు హ్యాకింగ్ ఓ ఆయుధంగా మారుతోంది.