Dailyhunt
సినీ కార్మికుల కోసం నాగ్ భారీ విరాళం..

సినీ కార్మికుల కోసం నాగ్ భారీ విరాళం..

కరోనా వల్ల ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. దాంతో రోజు వారి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అందులో సినీ కార్మికులు కూడా వున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ను నమ్ముకుని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి అయితే షూటింగ్ లు రద్దు కావడం తో సినిమానే నమ్ముకున్న దినసరి కూలీలు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. దాంతో సినీ కార్మికులకు అండగా నిలబడానికి టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ,రాజశేఖర్, అల్లరి నరేశ్, శివాజీ రాజా ఇప్పటికే తమకు తోచిన విధంగా విరాళాలను ఇవ్వగా ఈ జాబితాలోకి తాజాగా కింగ్ నాగార్జున కూడా చేరాడు.



సినీ కార్మికుల కోసం తన వంతు సాయంగా కోటి రూపాయలను నాగ్ విరాళంగా ప్రకటించాడు.

ఈ సందర్బంగా రోజు వారి సినీ వేతన కార్మికుల కోసం నా సహచరులు స్పందించిన తీరును ప్రశంసిస్తున్నాను. నేను కూడా ఆ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళంఇస్తున్నానని నాగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించాడు. మరోవైపు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ మొత్తం లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విరాళం ఇచ్చారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Kancherla Mahender Reddy

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald