మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ మోడల్పై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఒక ఒప్పందానికి వచ్చారు.
ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమాను విడుదల చేయడానికి ప్యానెల్ సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు.
ఈ ఒప్పందం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 'పెద్ది' చిత్రానికి టికెట్ ధరలు పెంచితే.. పెరిగిన ధరపై 7.5 శాతం అదనంగా చెల్లించనున్నారు. అలాగే ప్రీమియర్ షోల కోసం ప్రతి షోకు A సెంటర్లలో రూ. 25,000, B సెంటర్లలో రూ. 15,000, C సెంటర్లలో రూ. 10,000 చొప్పున చెల్లింపులు జరపాలని నిర్ణయించారు.
పరిశ్రమలో కొత్త పూర్తి స్థాయి పర్సంటేజ్ సిస్టమ్ను రాబోయే మూడు వారాల్లోపు లేదా తదుపరి పెద్ద సినిమా విడుదలలోపు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే 70% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలకు ఈ విధానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో 'పెద్ది' థియేట్రికల్ రిలీజ్కు లైన్ క్లియర్ అయింది.
The publish 'పెద్ది'కి లైన్ క్లియర్ చేసిన ఫిలిం ఛాంబర్..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
