Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?"

"అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?"

TeluguBulletin.com 3 weeks ago

మరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.

గ్లాస్‌పై మొత్తం ఖర్చు అంతగా లేదని, ఇందులో ముఖ్యంగా సోలార్ సాంకేతికతకు సంబంధించిన వ్యయమే పెద్ద భాగమని చెబుతున్నారు.

సచివాలయం భవనాల్లో ఉపయోగిస్తున్న గాజు సాధారణ గ్లాస్ కాదని, ఇది ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ప్రత్యేక నిర్మాణమని వివరాలు తెలియజేస్తున్నాయి. ఈ గ్లాస్ తలుపులు, ఫసాడ్‌లలో ఫోటో వోల్టాయిక్ సెల్స్ అమర్చబడి ఉంటాయి. వీటి ద్వారా సూర్యశక్తిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యం. ఈ సోలార్ ప్యానెల్స్ కోసం అయ్యే ఖర్చే ప్రధాన భాగమని, గ్లాస్ మొత్తం విలువ సుమారు రూ.1152 కోట్ల వరకు మాత్రమే ఉంటుందని సమాచారం.

భవన నిర్మాణంలో డబుల్ స్కిన్ విధానం ఉపయోగించడం వల్ల లోపలి ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బయట పొరను ప్రత్యేకంగా పోరస్ డిజైన్‌లో నిర్మించడం ద్వారా నేరుగా సూర్యకిరణాలు లోపలికి రాకుండా నీడ కలుగుతుంది. మధ్యలో ఖాళీ స్థలం ఉండటం వల్ల గాలి ప్రవాహం సహజంగా కొనసాగి, భవనంలో చల్లదనం నిలుస్తుంది. దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా సచివాలయం భవనాలు గ్రీన్ బిల్డింగ్ లక్షణాలను పొందుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆధునిక నిర్మాణాలతో పోలిస్తే అమరావతి ప్రాజెక్ట్ ఖర్చు అధికం కాదని నిపుణులు సూచిస్తున్నారు. అబుదాబిలోని క్యాపిటల్ గేట్ టవర్ (2011) చదరపు మీటరుకు సుమారు రూ.97,200, మకావ్‌లోని గ్రాండ్ లిస్బన్ (2008) రూ.78,400, చైనాలోని చైనా మర్చంట్ బ్యాంక్ భవనం (2025) రూ.89,000 వరకు ఖర్చు కాగా, అమరావతి GAD & HOD టవర్‌కు చదరపు మీటరుకు సుమారు రూ.80,893 మాత్రమే ఖర్చు అవుతోందని అంచనా.

ఈ నిర్మాణాల ద్వారా భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల విద్యుత్ ఆదా సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రారంభంలో పెట్టే పెట్టుబడితో దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో లాభం పొందేలా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ దీర్ఘకాల ప్రయోజనాలను పక్కనపెట్టి కేవలం ప్రారంభ ఖర్చుపైనే దృష్టి పెట్టి జరుగుతున్న విమర్శలు అవగాహన లోపం వల్లా, లేక ఉద్దేశ్యపూర్వక ప్రచారమా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin