రాజకీయ విశ్లేషకుడు Nageshwar చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. కేంద్ర హోంమంత్రి Amit Shah వద్ద వైఎస్ జగన్ అరెస్టు అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ప్రస్తావించారనే కోణంలో నాగేశ్వర్ చేసిన విశ్లేషణపై జనసేన వర్గాలు, సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి.
"ఇలాంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గర ఎందుకు ప్రస్తావిస్తారు? ఛాన్సే లేదు" అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. "ఈ స్థాయి రాజకీయ అవగాహన కూడా లేకుండా ఎలా విశ్లేషణ చేస్తారు?" అంటూ నాగేశ్వర్పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. 'ప్రొఫెసర్' అనే గుర్తింపుకు తగ్గట్టుగా ఈ విశ్లేషణ లేదని, అది పూర్తిగా గాలి వార్తల ఆధారంగా చేసిన వ్యాఖ్యలా కనిపిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన నాగేశ్వర్, అనేక న్యూస్ ఛానళ్లలో రాజకీయ విశ్లేషకుడిగా గుర్తింపు పొందారు. రాజకీయ అంశాలపై ఆయనకు మంచి అనుభవం ఉందని అందరూ అంగీకరిస్తారు. అయితే తాజా వ్యాఖ్యల విషయంలో మాత్రం ఆయన కూడా రాజకీయ ప్రచారానికి లోనయ్యారా? అనే చర్చ మొదలైంది.
"రాజకీయ విశ్లేషకులకు మార్కెట్లో భారీ రేట్లు పలుకుతున్నాయి.. ఏ రేటు నాగేశ్వర్ను టెంప్ట్ చేసిందో?" అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. "గాలి వార్తలను నిజాల్లా ప్రచారం చేయడం ద్వారా తన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారు" అని కొందరు పోస్టులు పెడుతున్నారు.
జనసేన వర్గాలు మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. 151 సీట్లతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ భయపడలేదని, రెండు చోట్ల ఓడిపోయినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపలేదని చెబుతున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్పై రాజకీయ విమర్శలు మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర వ్యాఖ్యలు జరిగాయని గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా, వైఎస్ జగన్ అసెంబ్లీకి రావడానికే వెనుకంజ వేస్తున్నారని జనసేన వర్గాలు విమర్శిస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో జగన్ అరెస్టు కోసం పవన్ కళ్యాణ్ కేంద్ర నాయకత్వాన్ని ఆశ్రయిస్తారనే వాదనలో లాజిక్ కనిపించడం లేదని అంటున్నారు.
"చంద్రబాబు అరెస్టు సమయంలో ఏ కేంద్ర మంత్రిని అనుమతి అడిగారు?" అనే ప్రశ్నను కూడా కొందరు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నాగేశ్వర్ వ్యాఖ్యలు రాజకీయ ప్రచారంలో భాగంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, "ఒకవేళ 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే నాగేశ్వర్కు ఏదైనా సలహాదారు పదవి ఆఫర్ చేశారా?" అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. "బీజేపీకి జగన్ శాశ్వత మిత్రుడు" అన్న నాగేశ్వర్ వ్యాఖ్యలపై కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.
ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారగా, రాజకీయ వర్గాల్లోనూ దీనిపై తీవ్ర చర్చ కొనసాగుతోంది.
ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అధికారికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తన వ్యాఖ్యలకు 24 గంటలలో ఆధారాలు చూపాలి. లేకుంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి" అని పార్టీ తరఫున డిమాండ్ చేశారు. "మీపైన గౌరవం ఉంది. కానీ గుర్తింపు కోసమో, మరేదైనా లబ్ధి కోసమో ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తారని అనుకోలేదు" అంటూ జనసేన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

