గత ఐపీఎల్ సీజన్ లో దారుణ పరాభవాన్ని చవిచూసింది చెన్నై సూపర్ కింగ్స్. ధోనీ కూడా మెరుపులు మెరిపించలేదు. రెండో సీజన్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరుగుతోంది.
అయితే.. ధోనీకి 40 ఏళ్లు రావడంతో సీఎస్ కే జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరంటూ సీఎస్ కే ఫ్యాన్స్ ఆర్మీ ఓ పోల్ నిర్వహించింది. ఇందులో ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. 8 అనే అంకె తో ట్వీట్ చేశాడు.
అతడి జెర్సీ నెంబర్ 8. దీంతో సీఎస్ కేకు కెప్టెన్ కావాలన్న తన కోరికను బయటపెట్టాడని కామెంట్స్ వచ్చాయి. వెంటనే విమర్శలు రావడంతో జడేజా.. ఆ ట్వీట్ ను తొలగించాడు. అయితే.. ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. నిజంగానే ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా..? మరో స్టార్ బ్యాట్స్ మెన్ రైనాను కాదని జడేజాకు కెప్టెన్సీ దక్కుతుందా..? అంటూ కొత్త చర్చ మొదలైంది.

