Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం: లోకేష్

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం: లోకేష్

మరావతిలో రాష్ట్రవ్యాప్తంగా డీఈవోలు, ఏపీసీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Nara Lokesh ప్రభుత్వ విద్యావ్యవస్థలో తీసుకురానున్న కీలక మార్పులపై విస్తృతంగా మాట్లాడారు.

"దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలి" అని స్పష్టం చేసిన మంత్రి లోకేష్, ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలను సొంత బిడ్డల్లా భావించి అధికారులు పనిచేయాలని సూచించిన మంత్రి, విద్యలో నాణ్యత పెరగకపోతే నష్టపోయేది పిల్లల భవిష్యత్తేనని అన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థ ఓపెన్ మార్కెట్‌తో పోటీ పడే స్థాయికి చేరుకోవాలంటే అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యాశాఖలో డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్న లోకేష్, తాను బాధ్యతలు స్వీకరించే సమయానికి రాష్ట్రంలోని పాఠశాలల వివరాలు, విద్యార్థుల సంఖ్య వంటి కనీస సమాచారం కూడా అందుబాటులో లేదని తెలిపారు. ప్రస్తుతం డ్యాష్‌బోర్డ్ ఆధారంగా పూర్తి స్థాయి డేటా సిస్టమ్ రూపొందించామని, దాని ఆధారంగానే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని డీఈవోలు, ఏపీసీలకు ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు డ్రాపవుట్స్‌గా ఉన్నారని, "నెవర్ ఎన్‌రోల్డ్" పిల్లలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నూరుశాతం ఎన్‌రోల్మెంట్ సాధించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని చెప్పారు. వలస కార్మికుల పిల్లలు చదువు మానేసి పనులకు వెళ్లే పరిస్థితి రాకూడదని, ఇందుకోసం పటిష్టమైన ట్రాకింగ్ మెకానిజం అవసరమని తెలిపారు.

లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (జీఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని ఉద్యమంలా అమలు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. చిన్న శాతం వెనుకబడినా అది లక్షల మంది పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం 9వ తరగతిలో క్లిక్కర్ టెక్నాలజీ అమలు చేస్తున్నామని, త్వరలో క్రోమ్‌బుక్స్ అందించనున్నామని తెలిపారు. వన్ క్లాస్ - వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 10 శాతం ఎన్‌రోల్మెంట్ పెరగాలన్న లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.

ప్రభుత్వ స్కూళ్లలో ప్రతిభావంతమైన ఉపాధ్యాయులు ఉన్నారని, ఇటీవల పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వం స్వయంగా ఇచ్చిన ప్రకటన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందన్నారు. ఈ ఏడాది మంచి ఫలితాలకు వంద రోజుల ప్రణాళిక ఎంతో ఉపయోగపడిందని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం స్టార్ రేటింగ్ విధానం తీసుకొచ్చామని మంత్రి వెల్లడించారు. ప్రతి పాఠశాలలో లీక్‌ప్రూఫ్ భవనాలు, తాగునీరు, టాయిలెట్లు, బెంచీలు, పెయింటింగ్ వంటి కనీస సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే దాతల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ కిచెన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు ప్రభుత్వ పాఠశాలను ఇంటర్నేషనల్ స్కూల్‌గా తీర్చిదిద్దుతున్నామని, అక్కడ అడ్మిషన్లు పూర్తై "నో అడ్మిషన్" బోర్డు పెట్టే స్థాయికి చేరుకుందని మంత్రి వివరించారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక మోడల్ స్కూల్ అభివృద్ధి చేయాలని అధికారులను కోరారు.

తాను విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ఉపాధ్యాయులు పూర్తిగా బోధనపైనే దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లీప్ యాప్ ద్వారా పాఠశాలల పనితీరును పర్యవేక్షిస్తున్నామని, త్వరలో పబ్లిక్ డ్యాష్‌బోర్డ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పాల్, ఏఐ బేస్డ్ లెర్నింగ్, ఏఐ ట్యూటర్ వంటి టెక్నాలజీలను కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

టెక్నాలజీతో పాటు నైతిక విలువలు కూడా చాలా ముఖ్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అందుకే Chaganti Koteswara Rao ను కేబినెట్ హోదాతో అడ్వయిజర్‌గా నియమించామని తెలిపారు. ప్రతి శనివారం వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జెండర్ సెన్సిటివిటీ, యోగా, స్పోర్ట్స్, విద్యార్థుల మానసికాభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా హెచ్ఆర్డీ కార్యదర్శి Kona Sasidhar మాట్లాడుతూ గత రెండేళ్లలో పాఠశాల విద్యావ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చోటుచేసుకున్నాయని అన్నారు. మంత్రి లోకేష్ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ విద్యావ్యవస్థలో గుణాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రశంసించారు.

ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి Tameem Ansariaతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin