జనసేన పార్టీ చేపట్టిన 'ఉద్యమి' సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న ఈ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan పాల్గొని సాధక్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలకు ఈ సమావేశం ద్వారా ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నారు. ముఖ్యంగా 300కు పైగా సభ్యత్వాలు నమోదు చేసిన సాధక్లను ఎంపిక చేసి సమావేశానికి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రక్రియలో పార్లమెంట్ ఇంచార్జులుగా వ్యవహరించిన పార్టీ నాయకులు కూడా పాల్గొననున్నారు. పార్టీ విస్తరణలో క్షేత్ర స్థాయిలో కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రోత్సాహం కలిగించేలా ఈ సమావేశం ఉండనుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతానికి ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం మంచి స్పందన తెచ్చిందని, భవిష్యత్ రాజకీయ కార్యాచరణలో ఈ నెట్వర్క్ కీలక పాత్ర పోషించనుందని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

