Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

TeluguBulletin.com 2 weeks ago

పీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు.

'రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం' పేరిట తిరుపతిలో నిర్వహించనున్న ఎన్‌డిఏ కూటమి భారీ బహిరంగ సభకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఎన్‌డిఏ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే, 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ వెన్నుపోటు పేరుతో నిరసనలు చేపట్టడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో ప్రజలు నిరాశకు గురయ్యారని, అందుకే 151 సీట్ల నుంచి ఆ పార్టీని కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారని పేర్కొన్నారు.

రాయలసీమ ప్రాంత అభివృద్ధి విషయంలో జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనిచేయలేదని అప్పసాని రాజేష్ ఆరోపించారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన ద్వారా రైతులు, యువతకు ప్రయోజనం చేకూరిందని చెప్పారు. అయితే వైసీపీ పాలనలో సాగునీటి రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కర్నూలులో సోలార్ ప్రాజెక్టులు, అనంతపురంలో కియా పరిశ్రమ, చిత్తూరు జిల్లాలో శ్రీసిటీ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించిన ఆయన, గతంలో వచ్చిన కొన్ని పెట్టుబడులు వైసీపీ పాలనలో రాష్ట్రం విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రాయలసీమలో ఉపాధి అవకాశాలు, సాగునీటి రంగం రెండూ దెబ్బతిన్నాయని అన్నారు.

అమరావతి రాజధాని అంశం, మద్యం నిషేధం హామీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి అంశాల్లో కూడా వైసీపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అప్పసాని రాజేష్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే విధమైన తీర్పు ఇచ్చి వైసీపీని తిరస్కరించారని, ప్రజల తీర్పును గౌరవిస్తూ ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

వెన్నుపోటు గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని, ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం వల్లే ఆ పార్టీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆ పార్టీ నాయకత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin