Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన...మహిళ డ్రస్సును పైకి లేపిన సైకో

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన...మహిళ డ్రస్సును పైకి లేపిన సైకో

హా నగరంలో శాంతిభద్రతలకు మారుపేరుగా నిలిచే హైదరాబాద్ నగరంలో మరోసారి మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. చదువుకున్న వారు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఎంతో ప్రశాంతంగా నివసించే ఐటీ కారిడార్ పరిధిలోని మణికొండ ప్రాంతంలో అత్యంత హేయమైన, ఘోరమైన ఉన్మాద ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ అల్కాపూర్ టౌన్‌షిప్, పంచవటి కాలనీ పరిసరాల్లో జరిగిన ఈ దారుణం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. సమాజం తలదించుకునేలా మిట్టమధ్యాహ్నం వేళ నడిరోడ్డుపై ఒక కామాంధుడు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, మే 14వ తేదీన మధ్యాహ్నం సుమారు 2:00 గంటల సమయంలో ఒక సామాన్య మహిళ తన చంటిబిడ్డను చంకన వేసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, రోడ్డు కాస్త నిర్మానుష్యంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న ఓ గుర్తుతెలియని యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు.

వెనుక నుంచి ఒంటరిగా వస్తున్న సదరు మహిళను గమనిస్తూ వచ్చిన ఆ దుర్మార్గుడు, ఒక్కసారిగా ఆమె వద్దకు వెళ్లడమే కాకుండా చంటిపిల్లాడిని ఎత్తుకున్నదనే కనీస మానవత్వం కూడా లేకుండా అత్యంత అసభ్యకరంగా వెనుక నుంచి వచ్చిన ఓ టీనేజ్ యువకుడు అకస్మాత్తుగా ఆమెను సమీపించి, పట్టపగలు అందరూ చూస్తుండగానే దుస్తులను పైకి ఎత్తి అవమానకరంగా ప్రవర్తించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో బాధిత మహిళ ఈరోజు ఉదయం నార్సింగ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే చర్యలు చేపట్టారు.నెక్నాంపూర్, మణికొండ, అల్కాపూర్ టౌన్‌షిప్ ప్రాంతాల నివాసితులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడిని వెంటనే గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు లను డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణ దృశ్యాలన్నీ అక్కడి వీధిలో అమర్చిన సిసిటివి (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. మే 19న ఈ భయంకరమైన సిసిటివి ఫుటేజ్ సోషల్ మీడియా వేదికలైన ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నెటిజన్లు ఆ వీడియోను చూసి తీవ్రంగా చలించిపోయారు.

"ఇలాంటి చిల్లర వెధవలు సమాజంలో ఎక్కువైపోయారు, వీళ్లకు అసలు బతుకులేనా?" అంటూ తీవ్రమైన పదజాలంతో నెటిజన్లు తమ ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. మిట్టమధ్యాహ్నం 2 గంటలకు నడిరోడ్డుపై ఒక తల్లికి, బిడ్డకు రక్షణ లేకపోతే ఇక మహిళల భద్రత ఎక్కడ ఉందంటూ ప్రజలు ప్రభుత్వ రక్షణ వ్యవస్థలను ప్రశ్నిస్తున్నారు. ఈ సోషల్ మీడియా వైరల్ వీడియో ఆధారంగా నార్సింగి పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, ఆ ప్రాంతంలోని మరికొన్ని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

కొందరు మగాళ్ల మానసిక స్థితి ఎంతలా దిగజారిపోతుందో అనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యమని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి కామోన్మాదులకు కేవలం సాధారణ కౌన్సిలింగ్ ఇవ్వడమో లేదా కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచడమో సరిపోదని, భవిష్యత్తులో ఏ ఒక్కడూ ఇటువంటి సాహసం చేయకుండా ఉండేలా అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐటీ హబ్‌గా వెలుగొందుతున్న హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి ఉన్మాద చర్యలు జరగడం సభ్య సమాజానికి పెద్ద మచ్చగా మిగిలిపోతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One