Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటకం.. కంటిన్యూస్...బట్ ఢిల్లీ లీక్స్ ఏంటంటే?

కర్ణాటకం.. కంటిన్యూస్...బట్ ఢిల్లీ లీక్స్ ఏంటంటే?

ళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ. ఒక రెండు మూడు రోజుల్లో ఒక వర్గం ఎంఎల్యేలు ఢిల్లీకి ప్రయాణం కావాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏఐసీసీని పూర్తి స్థాయి ప్రక్షాళన చెయ్యాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఉన్నట్టు సమాచారం.

అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కి ఈ మధ్యనే పేస్ మేకర్ కి సంబందించిన ఆపరేషన్ జరగడం.. దీంతో పాటు ఆయన వయసు సుమారు 84 ఏళ్ళు ఉండటం అటు ఆరోగ్య సమస్య ఇటు వయసు కూడ మీదికి రావడంతో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఏఐసీసీ కొత్త ప్రెసిడెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ అన్వేషణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కర్ణాటక సీఎం పంచాయతీ కూడ మళ్లీ తెరపైకి వచ్చింది.

సిద్ధ రామయ్య- 2028 వరకు నేనే సీఎం అని స్వయం ప్రకటనలు గుప్పిస్తున్నారు. సరిగ్గా అదే సమయలో డీకే సైతం తనకూ సీఎం పోస్టు కావల్సిందేనని పట్టు పడుతున్నారు. తనకు మద్దతు ఉన్న ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్య కి పరిష్కారం ప్రస్తుత దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని..

సిద్ద రామయ్యనే సీఎంగా కొనసాగిస్తూ డీకే శివ కుమార్ సేవలను దేశ వ్యాప్తంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్టు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడుమల్లికార్జున ఖర్గె ని రాజ్యసభ లో ప్రతిపక్ష నేత గా కొనసాగించి.. కొత్త ఏఐసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు.. డీకే శివ కుమార్ కి అప్ప చెప్పి..

దేశ వ్యాప్తంగా తన సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కాంగ్రస్ అధిష్టానం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. డీకే చేత ఎమ్మెల్యే పదవి, పీసీసీ పదవికి కూడా రాజీనామా చేయించి.. ఆయన వదులుకున్న ఎమ్మెల్యే పదవిని శివ కుమార్ తమ్ముడు- సురేష్ కి అప్పజెప్పేలా కనిపిస్తోంది. పీసీసీ పదవిని ఇక్కడ ఎవరికో ఒకరికి- పార్టీ సీనియర్ నాయకుడికి అప్పచెప్పాలని కూడా కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తున్న ఈ సమాచారం నిజంగానే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన సంచలన, అత్యంత వ్యూహాత్మక పరిణామంగా చెప్పవచ్చు. ఈ ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ హైకమాండ్ అటు కర్ణాటక సీఎం పీఠం వివాదానికి శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా, ఇటు జాతీయ స్థాయిలో ఏఐసీసీ కి ఒక పవర్‌ఫుల్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌షిప్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఈ మొత్తం పొలిటికల్ ఈక్వేషన్‌ను లోతుగా పరిశీలిస్తే, కాంగ్రెస్ అధిష్టానం ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టేలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఖర్గేకి 84 ఏళ్లు పైబడటం, ఇటీవల పేస్‌మేకర్ ఆపరేషన్ జరగడం వల్ల ఆయనపై జాతీయ స్థాయి పార్టీ బాధ్యతల భారాన్ని తగ్గించడం ఇటు రాజకీయంగా, అటు మానవీయ కోణంలో చూసినా అవసరంగా కనిపిస్తోంది.

అయితే ఆయనకున్న సీనియారిటీ, గౌరవాన్ని కాపాడుతూ ఆయన్ను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగించడం ద్వారా పార్లమెంట్‌లో పార్టీ పట్టు చేజారకుండా చూసుకోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం జరుగుతున్న అంతర్గత పోరు మరీ ముఖ్యంగా కేబినెట్ మార్పులు, కొందరు ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో.. పార్టీకి తలనొప్పిగా మారింది. సిద్ధరామయ్య ప్లస్ పాయింట్స్ ఏంటో చూస్తే, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల..

ఓటు బ్యాంకుపై సిద్ధరామయ్యకు ఉన్న పట్టును కాంగ్రెస్ వదులుచుకోలేదు. ఆయన్ను 2028 ఎన్నికల వరకు సీఎంగా ఉంచడం ద్వారా కర్ణాటక ప్రభుత్వ స్థిరత్వానికి ఢోకా ఉండదని భావిస్తోంది హస్తం పార్టీ. ఇక డీకే శివకుమార్‌కు కేవలం కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి చాలా చిన్నది. ఆయనకున్న ట్రబుల్ షూటర్ ఇమేజ్, ఆర్గనైజేషనల్ స్కిల్స్, ఆర్థిక వనరులను సమకూర్చగల సామర్థ్యం..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా అవసరం. ఆయన్ను నేరుగా ఏఐసీసీ ప్రెసిడెంట్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కూడా నింపినట్టు అవుతుంది. డీకే శివకుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఆయన ఎమ్మెల్యే పదవికి, కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ఆయన తమ్ముడు, మాజీ ఎంపీ అయిన డీకే సురేష్‌ను అసెంబ్లీకి పంపడం ద్వారా కనకపుర నియోజకవర్గంలో డీకే ఫ్యామిలీ పట్టు అలానే ఉంటుంది.

పీసీసీ పదవిని డీకే వర్గానికి చెందిన లేదా సిద్ధరామయ్యకు నమ్మకస్తుడైన ఒక సీనియర్ నేతకు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఈ వ్యూహం సక్సెస్ అయితే కాంగ్రెస్‌కు వచ్చే లాభాలు.. ఎలాంటివో చూస్తే.. సౌత్ ఇండియా సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతుంది.

ఖర్గే తర్వాత మళ్లీ సౌత్ ఇండియా.. అది కూడా కర్ణాటక నుంచే మరో పవర్‌ఫుల్ లీడర్ ఏఐసీసీ పగ్గాలు చేపట్టినట్టు అవుతుంది. ఆగ్రస్సివ్ పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. బీజేపీని వారి శైలిలోనే ఢీకొట్టడానికి డీకే శివకుమార్ లాంటి దూకుడున్న నాయకుడు ఏఐసీసీ చీఫ్‌గా పర్ఫెక్ట్ ఛాయిస్.

ఈ కుర్చీ లాటరీకి ఎండ్ కార్డ్ పడితే, సిద్ధరామయ్య ప్రభుత్వం పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవచ్చు. ఈ ఢిల్లీ లీక్స్ గనుక నిజమైతే, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత నిర్మాణంలో చాలా పెద్ద మార్పులు చూడబోతున్నాం. డీకే శివకుమార్ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి పార్టీని ఏ మేరకు ముందుకు నడిపిస్తారనేది అత్యంత ఆసక్తికరం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One