సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడుపై నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తాను పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేయడమే కాకుండా, బెదిరింపులకు పాల్పడుతున్నాడనీ, తనకు రక్షణ కల్పించాలనీ ఆమె సంజీవరెడ్డి నగర్ పోలీసులను కోరారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లు సహజీవనం చేశాక తనను మోసం చేశాడంటూ గత ఏడాది చేసిన తన ఫిర్యాదులో ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి తాను రాజీ కుదుర్చుకున్నట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి కోర్టుకు సమర్పించాడనీ, అయినా అతడిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేదనీ ఆమె తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు.

