Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీమలో తెలుగుదేశం కూటమి భేష్.. మరి వైసీపీయో?

సీమలో తెలుగుదేశం కూటమి భేష్.. మరి వైసీపీయో?

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి, సంక్షేమాలను జోడుద్దులుగా సమానంగా అమలు చేస్తూ ప్రజాదరణ పెంచుకుంటోంది.

అదే సమయంలో రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న వైసీపీ పరిస్థితి మాత్రం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది. కేవలం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితం కాకుండా, కాకుండా, అభివృద్ధి కేంద్రీకృత పాలిటిక్స్ తో ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీకి పెట్టని కోట లాంటి రాయలసీమలో ప్రస్తుతం ప్రగతి వెలుగులు తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా మారుతున్నాయి. తిరుపతి జిల్లాలో శ్రీ సిటీని విస్తరించడం, అనంతపురం జిల్లాలో తయారీ రంగ పరిశ్రమలను ప్రోత్సహించడం, కడప మరియు కర్నూలు జిల్లాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా సీమను ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తోంది చంద్రబాబు సర్కార్. ఈ ప్రాంతంలో నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

ఇది సీమలో తెలుగుదేశం కూటమి పట్ల ప్రజా బాహుల్యంలో సానుకూలతను పెంచుతోంది. అదే సమయంలో.. వైసీపీ ఆదరణ రోజు రోజుకూ తగ్గుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాయలసీమలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైసీపీకి తిరుగులేని పట్టు ఉండేది.

తెలుగుదేశం పార్టీకి అక్కడక్కడా కొన్ని నియోజకవర్గాల్లో పట్టు ఉన్నప్పటికీ, మొత్తంగా సీమలో వైసీపీదే అధ్యప్యం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. అయితే తెలుగుదేశం కూటమి 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టినప్పటి నుంచీ వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో పట్టు సాధించడమే లక్ష్యంగా పావులు కదిపింది. ఎన్నికల ఫలితాలు వెలువడి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ తెలుగుదేశం కూటమి రాజకీయాలు కాకుండా అభివృద్ధిని మెయిన్ అజెండాగా తీసుకుని ముందుకు సాగింది. రాజకీయంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా ముందుకు సాగడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్న పరిస్థితి. AP Coalition Government, Rayalaseema Development Strategy, Chandrababu Naidu Political Strategy, Telugu One

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One