Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టెన్త్‌ టాపర్లను విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గళ్ళ మాధవి

టెన్త్‌ టాపర్లను విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గళ్ళ మాధవి

టెన్త్ టాపర్లకు గుంటూరు ఎమ్మెల్యే ప్రత్యేక ప్రోత్సాహం.. పదో తరగతి 40 మంది టాపర్లతో విమానంలో ఢిల్లీకి ఎమ్మెల్యే.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం లభించింది.

పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆమె విమానంలో ఢిల్లీకి విజ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులు గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కేంద్ర మంత్రి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి, పదవ తరగతిలో ప్రతిభ కనబర్చినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆయన ప్రోత్సహించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలు, ఉన్నత విద్యపై వారి ఆసక్తులను తెలుసుకుంటూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి చేపట్టిన ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One