Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tollywood Trending టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు న్యూస్ చూద్దాం

Tollywood Trending టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు న్యూస్ చూద్దాం

నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ థియేటర్స్ విషయంలో ఏదేదో మాట్లాడుకుంటారు. కానీ నేను మాత్రం తగ్గేదెలే అంటు పలు తెలుగు సినిమా తాజా న్యూస్ అందుబాటులో ఉన్నాయి.

అవేంటో చూద్దాం 1 . విజయ్ కి నాకు పోలికా అంటున్న పవన్ పవన్ కళ్యాణ్ విజయ్ విజయంపై పవన్ స్పందిస్తు ఒక రాష్ట్రంలో జరిగింది ఇక్కడ కూడా అలాగే జరుగుతుందని భావించడం సరికాదు. అక్కడి రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు కొందరు అనవసర ప్రచారం చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తనతో ఉన్న చాలామంది నాయకులు పార్టీని వీడిపోయారు. జనసేన అనేది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. దాదాపు పాతికేళ్లుగా తనలో పెరిగిన ఆలోచనకి రూపమని పవన్ చెప్పుకొచ్చాడు 2 . వీరభద్రుడు ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ సూర్య నిన్న వరల్డ్ వైడ్ గా వీరభద్రుడుతో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ఒకరోజు లేటుగా వచ్చినా కూడా ఎవరు ఊహించని విధంగా తొలి రోజు 20.66 కోట్ల గ్రాస్ వసూళ్లతో అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. తెలుగు స్టేట్స్ లో 2.4 కోట్ల గ్రాస్, తమిళ వెర్షన్ '13.10 కోట్లు, ఓవర్ సీస్ 4 కోట్లుతో టోటల్ గా 20.66 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. 3 .మహేష్ బాబు రెస్టారెంట్ బిల్లు వైరల్.. వాటర్ బాటిల్ రేటు చూస్తే షాకవుతారు ఏషియన్ గ్రూప్, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ భాగస్వామ్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో 'ఏఎన్‌ ప్యాలెస్ హైట్స్' అనే లగ్జరీ రెస్టారెంట్‌ని నడుపుతున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఒక హైదరాబాద్ బేస్డ్ ఫుడ్ బ్లాగర్ ఈ రెస్టారెంట్‌ ని సందర్శించి వీడియో షేర్ చేసింది. సదరు వీడియోలో ఒక చికెన్ టిక్కా స్టార్టర్ ధర 700 ,ఒక మటన్ బిర్యానీ ధర 600 గా ఉంది. అయితే వాటర్ బాటిల్ ధర 299 రూపాయలుగా ఉండటం ఇప్పుడు వైరల్ గా మారింది. 4 .ముంబైలో చేతి బ్యాండేజ్‌తో కనిపించిన రామ్ చరణ్..

ఫ్యాన్స్‌లో టెన్షన్ చరణ్ రీసెంట్ గా ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హాకీమ్ ఆలిం సెలూన్‌కి వెళ్ళాడు. చరణ్ కుడి చేతికి ఉన్న బ్యాండేజ్‌ ఉండటంతో ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అయితే తాజాగా చేతి గాయంపై చరణ్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చరణ్‌ కుడి చేతి మణికట్టు వద్ద ఒక చిన్న మైల్డ్ స్ప్రెయిన్ స్వల్ప నలిగుడు లాంటి మితమైన నొప్పి మాత్రమే అయింది. ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదు.

కేవలం ముందుజాగ్రత్త చర్యగా, ఆ నొప్పి మరింత ఎక్కువ కాకుండా ఉండటానికి డాక్టర్ల సలహా మేరకుసపోర్ట్ బ్యాండేజ్ ధరించినట్లు క్లారిటీ వచ్చింది. 5 . మళ్ళీ థియేటర్స్ లోకి హనుమాన్ టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ 'హనుమాన్' మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఈసారి సరికొత్త త్రీడీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులని అలరించేందుకు జూన్ 25, 2026న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

6 . పర్శంటేజ్ సిస్టం నుంచి మినహాయింపు కోరిన 17 సినిమాలు కొన్ని రోజులుగా నిర్మాతలు, థియేటర్స్ ఓనర్స్ మధ్య పర్సంటేజ్ సిస్టమ్ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే పెద్ది, డ్రాగన్ , విశ్వంభర, కల్కి 2', స్పిరిట్', వారణాసి, ది ప్యారడైజ్, రాకా, ఎన్ బి కె 111 , మెగా 158 ,రామ్ చరణ్, సుకుమార్ కాంబో మూవీ, ఏ కె 47 ,నాని, సుజిత్ కాంబో, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో, అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్, జై హనుమాన్ ఇలా సుమారు 17 చిత్రాలకి పర్శంటేజ్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. 7 .

పెద్ది సెట్ లో చిరంజీవి గంటన్నర కూడా ఉండలేకపోయారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో పెద్ది జూన్ 3 నుంచే ప్రీమియర్స్ కి సిద్దమవుతుంది. రీసెంట్ గా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతు చరణ్ కుస్తీ పోటీల్లో పడుతున్న కష్టం చేసి చిరంజీవి గారు గంటన్నర కూడా సెట్స్ లో ఉండలేకపోయారని చెప్పాడు. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా నిలిచాయి. 8 .

12 కోట్ల ఆఫర్ ని వదులుకున్న త్రిష రజినీ, కమల్ ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష ఒక హీరోయిన్ గా చేస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ త్రిష ఈ చిత్రంలో చెయ్యడం లేదని, మేకర్స్ 12 కోట్లరూపాయలు ఆఫర్ చేసిన త్రిష రిజెక్ట్ చేసినట్టుగా ఆంగ్ల మీడియాలో కధనాలు వినిపిస్తున్నాయి 9 . పెద్ది క్లైమాక్స్ ఎపిసోడ్ వైరల్ రీసెంట్ గా పెద్ది దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతు పెద్ది చివరి 50 నిమిషాల ఎపిసోడ్ హై వోల్టేజ్ ఎమోషన్స్‌తో సాగుతుంది.

ఆ సీన్స్ చూస్తున్నప్పుడు ప్రేక్షకుల గుండె బరువెక్కడం మాత్రమే కాదు. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని బుచ్చిబాబు ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేసాడు. ఈ మాటలు అభిమానుల్లో జోష్ తెప్పిస్తున్నాయి. 10 .

మంచు మనోజ్ టీంలో మిస్టరీ డెత్ మంచు మనోజ్ అప్ కమింగ్ మూవీ 'డేవిడ్ రెడ్డి' సినిమా షూటింగ్ లో తీవ్ర విషాదం నెలకొంది. DOP విభాగంలో పనిచేసే లక్ష్మణ్ రావు అనే వ్యక్తి పని చేస్తున్నాడు. రీసెంట్ గా లక్ష్మణ రావు చనిపోయారు. అకస్మాత్హుగా జరిగిన ఈ ఘటనతో మంచు మనోజ్ తో సహా టీం షాక్ కి గురైంది. అనుమానాస్పద స్థితిలో మరణించడంతో మనోజ్ తెలంగాణ, కర్ణాటక డీజీపీలకి మరణం విషయంపై ట్వీట్ చేసి నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నాడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One