టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్, ఇప్పుడు మరో సెన్సేషనల్ డైరెక్టర్తో జతకట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
'బేబీ' సినిమాతో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh), విజయ్ దేవరకొండ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ను సెట్ చేసే బాధ్యతను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నట్లు సమాచారం. గతంలో విజయ్తో 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి చిత్రాలను నిర్మించిన మైత్రీ సంస్థ, ఇప్పుడు సాయి రాజేష్తో కలిసి మరో డిఫరెంట్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. సాయి రాజేష్ చెప్పిన కథ విజయ్కు బాగా నచ్చిందని, ముఖ్యంగా అందులోని ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్ వినూత్నంగా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 'రణబాలి', రవికిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్ధన' సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే సాయి రాజేష్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సాయి రాజేష్ తన సినిమాల్లో ఎమోషన్స్ను చాలా సహజంగా, బోల్డ్గా చూపిస్తుంటారు.
అటు విజయ్ దేవరకొండ కూడా ఇంటెన్స్ పాత్రలు చేయడంలో సిద్ధహస్తుడు. ఈ ఇద్దరూ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం కూడా యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఉండబోతుందా లేక సీరియస్ డ్రామానా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

