కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఏకైక తెలుగు నియోజకవర్గం యానాం పలితం వెలువడింది. ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు.
తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికలో మొత్తం 35 వేల 840 ఓట్లు పోలయ్యాయి. వీటిలో మల్లాడి కృష్ణారావుకు 19 వేల 853 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మల్లాడి కృష్ణారావు, ఈసారి తిరిగి బరిలోకి దిగి తన పట్టును నిరూపించుకున్నారు. యానాం నియోజకవర్గంలో ఆయనకు ఇది ఆరో విజయం కావడం విశేషం.

