Himachal Pradesh : హిమాచల్ప్రదేశ్లో ఘోరప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రయాణిస్తున్న వాహనంపై కొండచరియలు విరిగిపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు.
మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం
కొండచరియలు విరిగిపడటంతో...ఉదయ్పూర్-కిల్లార్ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కులు నుంచి పాంగీ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. మృతదేహాలను బయటకు వెలికి తీశారు. మృతులు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

