ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. రెండు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు అనుమానించి నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
త్వరలో నిందితులకు నోటీసులు ఇచ్చేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సిద్ధమవుతున్నారని తెలిసింది.
ఐటీ రిటర్న్స్ ఇవ్వకపోవడంపై...
రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఐటీ రిటర్న్స్ ఇవ్వకపోవడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిస్టలరీస్ వెండర్స్ కు ఐదు సార్లు చెల్లింపులు జరిపినట్లు కనుగొన్నారు. హవాలా మార్గంలో దుబాయ్ కు వేల కోట్ల రూపాయలను మళ్లించినట్లు అనుమానిస్తున్నారు. ఫేక్ ఇన్వాయిస్ లతో రెండు వేల కోట్ల రూపాయలను డిస్టలరీస్ కు చెల్లించినట్లు కూడా ఐటీ శాఖ అధికారులు అనుమానిస్తున్నార..

