Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Andhra Pradesh :  గల్లంతయిన జాలర్ల కోసం కొనసాగుతున్న గాలింపు

Andhra Pradesh : గల్లంతయిన జాలర్ల కోసం కొనసాగుతున్న గాలింపు

TeluguPost.com 2 weeks ago

Visakha : సముద్రంలో విశాఖకు చెందిన గల్లంతయిన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 1వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు జాలర్లు కనిపించకుండా పోయారు.

వారిలో ఒకరు సురక్షితంగా బయటకు వచ్చారు.

ఆరుగురి ఆచూకీ కోసం...

మత్స్యకారుల ఫోన్‌లు స్విచ్‌ఆఫ్‌ అవడంతో గల్లంతయ్యారని మెరైన్ పోలీసులకు వారి బంధువులు సమాచారం అందించారు. దీంతో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డ్‌, నేవీ, మెరైన్ పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఇప్పటి వరకూ మత్స్యకారుల జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu