ఇంధన ధరల పెంపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంధనం పొదుపు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు నిచ్చారు.
పెట్రోలు ధరల పెంపుతో కావాలని నిత్యావసరాల ధరలు పెంచితే ఊరుకోబోమని నాదెండ్ల వార్నింగ్ ఇచ్చారు.
నిత్యావసరాల ధరల...నిత్యావసరాల ధరల నియంత్రణకు సమీక్షలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పెట్రోల్పై ఆధారపడటం తగ్గించేలా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అలాగే నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠినంగా శిక్షిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.

