ఇరాన్ పై దాడుల విషయంలో ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ పై నేడు చేయాలనుకున్న దాడులు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ట్రంప్ ప్రకటించారు. యూఏఈ, సౌదీ, ఖతార్ పాలకుల విజ్ఞప్తి మేరకేనని ట్రంప్ వెల్లడించారు.
ప్రస్తుతం ఇరాన్ తో సీరియస్ గా చర్చలు జరుగుతాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ తో చర్చలు కొనసాగుతున్నట్లు ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు.
శాంతి ఒప్పందం కోసం...
ఒప్పందంగా మారే అవకాశం ఉందని దేశాల పాలకులు భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్ తో శాంతి ఒప్పందం యూఎస్, పచ్చిమాసియా దేశాలకు ఆమోదయోగ్యం లభించనుంది. శాంతి ఒప్పందంలో ఇరాన్ వద్ద అ అణ్వాయుధాలు ఉండకూడదని, మిత్ర దేశాల నేతలపై ఉన్న గౌరవంతోనే ఇరాన్ పై దాడులను వాయిదా వేసినట్లుట్రంప్ వెల్లడించారు. సౌదీ, ఖతార్, యూఏఈ పాలకులు ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం అందుతుంది.

