అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చలేదు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండబోదని అంగీకరించాలని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని తక్షణమే సుంకాలు లేకుండా తెరవాలని, వాటర్ మైన్ లు ఉంటే, వాటిని త్వరగా నిర్వీర్యం చేయాలని ట్రంప్ కోరారు.
నావికా దిగ్బంధనంతో చిక్కుకున్న ఓడలు తిరిగి వెళ్లే ప్రక్రియ ప్రారంభించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.
అణ్వాయుధాల విషయంలో...
అణు ధూళిగా పిలువబడే సుసంపన్నమైన పదార్థాన్ని వెలికితీసి నాశనం చేస్తామని తెలిపారు. తదుపరి ప్రకటన వచ్చేవరకు ఎలాంటి డబ్బు మార్పిడి జరగదని, చాలా తక్కువ ప్రాముఖ్యత ఉన్న అంశాలకు అంగీకారం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం ముగియకపోవడంతో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎదుర్కొన్నాయి.

