Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ కు సమన్లు

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ కు సమన్లు

TeluguPost.com 1 week ago

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 31వ తేదీన విచారణకు రావాలని సమన్లలో పేర్కొన్నారు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు కేటీఆర్ నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసింది.

మరికొందరికి కూడా...కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు బీఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవిందకుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి ని చేర్చింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో అవినీతి జరిగిందని ఏసీబీ దర్యాప్తు చేసిన నేపథ్యంలో కోర్టు నిందితులందరికీ సమన్లు జారీ చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu