Hyderabad : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇరవై మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ఇరవై మంది మహిళలు ప్రయత్నించారని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.
వీరిని అదుపులోకి తీసుకన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారిస్తున్నారు.
నకిలీ వీసాలతో...
అయితే అదుపులోకి తీసుకున్న మహిళలు మాత్రం తమను ఏజెంట్ మోసం చేశాడని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎదుట వాపోతున్నారు. దీనిపై ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ చేస్తున్నారు. నిజంగా ఏజెంట్ మోసం చేశాడా? లేక నకిలీ వీసాలతో మహిళలు మస్కట్ కు వెళ్లేందుకు ప్రయత్నించారా? అన్న కోణంలో విచారిస్తున్నారు.

