హైదరాబాద్ లో హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. నార్సింగిలో హైడ్రా అధికారులు చెరువును ఆక్రమించిన వాటిని తొలగిస్తున్నారు. నార్సింగిలోని ముష్కి చెరువుకు ఇరిగేషన్, హైడ్రా అధికారులు కంచె ఏర్పాటు చేస్తున్నారు.
ఈ చెరువును కబ్జాకు గురయినట్లు గుర్తించిన అధికారులు రంగంలోకి దిగారు.
అరవై ఎకరాల చెరువులో...మొత్తం అరవై ఎకరాల ముష్కి చెరువులో పది ఎకరాల భూమిక కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. అందిన ఫిర్యాదు మేకరకు వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు చెరువు చుట్టూ కంచె వేస్తున్నారు. దీంతో పాటు పది ఎకరాల కబ్జా స్థలంలో నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు.

