కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి కి తీవ్ర గాయాలుఅయ్యాయి. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉంది.
చికిత్స నిమిత్తం కాకినాడ జిజిహెచ్ కి తరలించారు. ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా టిప్పర్ లారీ ఢీకొనింది.
మృతులు ఉపాధి హామీ కూలీలే...
కూలీలను టిప్పర్ లారీ ఢీకొట్టడంతో నలుగురు మరణించడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా రావడంవల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

