కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సతీశన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సతీశన్ తో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.
రమేష్ చెన్నితాలతో పాటు యూడీఎఫ్ లోని మిత్రపక్షాలకు చెందిన వారికి కూడా సతీశన్ తన కేబినెట్ లో చోటు కల్పించారు.
పూర్తి స్థాయి మంత్రివర్గం...సతీశన్ తో పాటు పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని నియమించడం విశేషం. ఇరవై మంది మంత్రులు ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్యతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా హాజరయ్యారు.

