Nizamabad : నిజామాబాద్ లో చిరుత సంచారం కలకలం రేపింది. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు సమాచారం అందించారు.
శ్రవణ్ అనే రైతు కోళ్ల ఫామ్కు చిరుత రావడాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
కోళ్ల ఫామ్ కు...అయితే కోళ్ల ఫామ్ కు చిరుత ప్రవేశించడంతోనే కుక్కల అరుపులతో వెనుదిరిగింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. స్థానికులు ఎవరూ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, చిరుత పట్టుబడేంత వరకూ తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

