మెక్సికోలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పది మంది మరణించారు. మెక్సికోలోని ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్ విట్టింగోలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో పది మంది మరణించారు.
మృతుల్లో మహిళలతో పాటు ఒక చిన్నారి ఉన్నారని అధికారులు తెలిపారు. ఆదివారం జరిగిన ఘటన కలకలం రేపింది.
కాల్పులు ఎందుకన్నది...దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరపడానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. అయితే కాల్పులు జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దుండగుడిని అదుపులోకి తీసుకున్నారా? లేదా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో కొందరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

