నేటి నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ ప్రపంచ కప్ లో మొత్తం పన్నెండు దేశాలకు చెందిన జట్లు 33 మ్యాచ్లు ఆడనున్నాయి.
మహిళ క్రికెట్ అందులో టీ20కి మంచి క్రేజ్ ఇటీవల కాలంలో ఏర్పడింది.
14న భారత్ vs పాక్...ఈరోజు జరిగే తొలిపోరులో ఇంగ్లండ్ తో శ్రీలంక ఢీకొంటుంది. రాత్రి 11 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నెల 14వ తేదీన భారత్, పాకిస్థాన్ మహిళల జట్ల మ్యాచ్ ఉండనుంది. మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించారు.

