గత ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలు ఓటు వేయడమే కాదు.. చరిత్ర తిరగరాస్తారని చప్పారు.
ఈ కూటమి ప్రభుత్వం ఒక తరానికి భవిష్యత్ కు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. తిరుపతి సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తమకు రెండేళ్ల క్రితం అధికారం ప్రజలు ఇవ్వలేదని, బాధ్యత ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేస్తూ...కూటమితో పొత్తు పెట్టుకున్నందుకు చాలా మంది విమర్శలు చేస్తున్నారని, కానీ ప్రజలు మాత్రం తమను వందశాతం ఆశీర్వదించారని పవన్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వమేనని అన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. ప్రజలకు అవినీతి లేని సేవలు అందించడమే తమ లక్ష్యమని పవన్ వివరించారు.

