పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పందించారు. అమెరికా-ఇరాన్ యుద్ధం వల్లే పెట్రోల్, డీజిల్ ధరల పెంచడం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు.
చమురు సంస్థలు నష్టాలలో నడుస్తున్నా నాలుగేళ్ల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
తప్పనిసరి పరిస్థితుల్లో...క్రూడాయిల్ దిగుమతికి ఖర్చు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. పెట్రోలు భారం ప్రజలపై వేయ కూడదని భావించినప్పటికీ తప్పని సరి పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందన్నారు. పనీపాటాలేని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పెట్రోలు, డీజిల్ పెంపు పై రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.

