Chithoor : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. వి.కోట మండలం రామాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి చెందగా మరో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి.
మృతి చెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లుగా పోలీసులు గుర్తించారు.
మృతులు తిరుపతికి చెందిన...
మృతులు తిరుపతికి చెందిన గౌతమి, మానసగా గుర్తించిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్న కారు టైర్ పంచర్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

